: పోలవరం పనులను పర్యవేక్షించనున్న చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు ఈ రోజు పరిశీలించనున్నారు. అనంతరం, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. కాగా, మూడు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రూ.60 లక్షల విలువ చేసే భారీ ఎక్సావేటర్ లో మంటలు వ్యాపించి సగంపైనే కాలిపోయింది.

More Telugu News