: తగ్గినట్టే తగ్గించి, మళ్లీ బాదిన చమురు కంపెనీలు... పెరిగిన 'పెట్రో' ధరలు

ఈ నెలారంభంలో కాస్తంత తగ్గిన పెట్రోలు, డీజెల్ ధరలు మరోసారి పెరిగాయి. తక్షణం అమల్లోకి వచ్చేలా పెట్రోలుపై రూ. 1.39, డీజెల్ పై రూ. 1.04 మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చమురు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో వచ్చిన మార్పునకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. కాగా, ఈ నెల 1వ తేదీన పెట్రోలుపై రూ. 3.77, డీజెల్ పై రూ. 2.91 చొప్పున తగ్గిస్తూ, చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News