: తెలంగాణలో 68 శాతానికి చేరుకోనున్న రిజర్వేషన్లు

తెలంగాణలో రిజర్వేషన్లు 68 శాతానికి చేరుకోనున్నాయి. తమిళనాడు తరహాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను ఆయన పంచుకున్నారు. రిజర్వేషన్లను 68 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. ఇందులో బీసీ-ఈ కోటాలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. దీంతో రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ 68 శాతానికి చేర్చారు. దీనిపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

More Telugu News