: ఢిల్లీలో దారుణ ఘటన.. అంబులెన్స్‌లో ఇంధనం లేక చిన్నారి మృతి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా వాహనంలో ఇంధనం అయిపోయి, ఆగిపోవ‌డంతో దారిమధ్యలోనే మూడేళ్ల‌ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌పై ఉన్న మూడు నెలల బాబును ప్రత్యేక చికిత్స కోసం సివిల్‌ ఆస్పత్రి నుంచి సఫ్దర్‌గంజ్ ఆసుప‌త్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై ఉన్నతస్థాయి కమిటీని వేదిక ఇవ్వగానే ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గుడ్‌గావ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో రెండు సివిల్‌ ఆస్పత్రులకు 16 అంబులెన్స్‌లు ఉంగా, అవన్నీ చాలా పాతవని తెలుస్తోంది.

More Telugu News