: భారత ఆటగాళ్లు, మేము చాలా సరదాగా ఉంటాం: ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్

ఇటీవల ముగిసిన భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ నానా రచ్చ మధ్య ముగిసిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. మాటల తూటాలు పేలాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇకపై తనకు ఏమాత్రం మిత్రులు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే, ఆస్ట్రేలియా విధ్యంసకర బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మాత్రం కోహ్లీకి విరుద్ధంగా ప్రతిస్పందించాడు. భారత ఆటగాళ్లు, తాము చాలా సరదాగా ఉంటామని చెప్పాడు. టెస్ట్ సిరీస్ సందర్భంగా కొంత వివాదం చెలరేగినా... అదంతా గత చరిత్ర అని అన్నాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు, గెలవడమే లక్ష్యంగా ఉంటుందని... అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతామని చెప్పాడు. టెస్ట్ సిరీస్ నెగ్గకపోవడం బాధను కలిగించినప్పటికీ... ఎన్నో పాఠాలను నేర్పిందని తెలిపాడు.

More Telugu News