: పార్టీ సీనియర్ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు!

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు ముందు పార్టీలోని విభేదాలు కాంగ్రెస్ అధినాయకత్వానికి చికాకులు తెప్పిస్తున్నాయి. పార్టీలోని సీనియర్ నేతలైన కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా, నెట్టా డిసౌజాలు తనను మానసికంగా వేధించారని, బెదిరించారని ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రచన సచ్ దేవా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు తనను బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు తుగ్లక్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More Telugu News