: బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలసి పని చేస్తా: మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే ఏ పార్టీతోనైనా, కూటమిలోనైనా చేరే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ఆమె, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని మరోసారి ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆ పార్టీని 2019 ఎన్నికల్లో గద్దె దించేందుకు తనవంతు పాత్రను పోషిస్తానని చెప్పారు. కాగా, తదుపరి లోక్ సభ ఎన్నికల నాటికి దళితుల బలం ఉన్న బీఎస్పీ, ఇతర బీజేపీయేతర పార్టీలు కలసి కూటమిగా ఏర్పడితే, బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

More Telugu News