: ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదానికి తెర

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఓ వివాదం ముగిసిపోయింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించిన వివాదం సుఖాంతమయింది. కేసులు, బ్యాంక్ అకౌంట్ల సీజ్ వరకు వెళ్లిన ఈ వ్యవహారం... ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ, తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డిల సంప్రదింపుల ఫలితంగా పరిష్కారం అయింది. జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని ఇరు రాష్ట్రాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. దీని ప్రకారం ఏపీకి రూ. 640 కోట్లు, తెలంగాణకు రూ. 465.64 కోట్లు చెందుతాయి. పది రోజుల్లోగా ఈ డబ్బు పీడీ ఖాతాలకు చేరుతుందని పితాని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల సాధనకు ఇదొక ముందడుగని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి తెలంగాణ సర్కారు చూపిన చొరవ అభినందనీయమని చెప్పారు.

More Telugu News