: ఏపీ ఇంటర్ ఫలితాల్లో వికసించిన విద్యా కుసుమాలు!

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ర్యాంకర్ల వివరాలను మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించారు. విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ప్రతి గ్రూప్ లో టాప్ స్థానాల్లో నిలిచిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంపీసీలో షేక్ షర్మిల (170726468 - 992 మార్కులు)కు మొదటి స్థానం లభించింది. దోసపాటి శాయి వంశీ (1705247561 - 991 మార్కులు) రెండో స్థానంలో, డీ లోకేశ్ బాబు (1709213857 - 991 మార్కులు) మూడో స్థానంలో నిలిచారు.

బైపీసీలో ఆలపాటి నైమిష (1726213150 - 991 మార్కులు) ప్రథమ స్థానంలో, పసుపులేటి లీమ (1703216386 - 990 మార్కులు) రెండో స్థానంలో, ఎస్ సారిక (1709229080 - 990 మార్కులు) తృతీయ స్థానంలో నిలిచారు.
ఎంఈసీలో డీ నేహ (170121092 - 983 మార్కులు) మొదటి స్థానంలో, ఏ భువనేష్ (1709236816 - 982 మార్కులు) రెండో స్థానంలో, ఆర్ అవినాష్ (1708237190 - 981 మార్కులు) మూడో స్థానంలో నిలిచారు.

సీఈసీలో యుక్త (1709241113 - 969 మార్కులు) మొదటి స్థానంలో, డి పల్లవి (1709236655  - 965 మార్కులు) రెండో స్థానంలో, కేఆర్ మహేశ్వరి (1712229662 - 965 మార్కులు) మూడో స్థానంలో నిలిచారు. హెచ్ఈసీలో మోజెస్ (1704231393 - 962 మార్కులు) మొదటి స్థానంలో నిలిచారని గంటా ప్రకటించారు.

More Telugu News