jyothy: ప్రజలతో కాస్త దూరం పెరిగింది... ఢిల్లీ ఉప ఎన్నికలో ఓటమిపై ఆప్!

ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా మాట్లాడుతూ, తమ ఓటమికి ప్రధాన కారణం తమ పార్టీ అభ్యర్థేనని చెప్పారు. ప్రజలకు కొంచెం దూరమయ్యామని... వారితో తమ పార్టీ సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఓటమి తమకు ఎదురుదెబ్బ కాదని... మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News