: నేడు హైదరాబాదుకు వస్తున్న ఉపరాష్ట్రపతి

భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేడు హైదరాబాదుకు విచ్చేస్తున్నారు. గచ్చిబౌలిలో ఉన్న మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ యూనివర్శిటీ (మనూ)లో జరగనున్న కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆనాటి హైదరాబాద్ పాలకుడు, మెదటి మహ్మద్ కులీకుతుబ్ షాహిపై స్మరకోపన్యాసం చేస్తారు. ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగి, అక్కడ నుంచి నేరుగా మనూకు చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన వెంటనే తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

More Telugu News