: భార‌త్‌లో ఉన్న ప్రతి పాక్ జాతీయుడిని కొట్టి కొట్టి తరిమేయండి: ఎంఎన్ఎస్ పిలుపు

గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన అంశంపై భారత ప్రభుత్వం అభ్యంత‌రాలు తెలుపుతున్న విష‌యం తెలిసిందే. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఈ అంశంపై స్పందిస్తూ.. కుల్ భూష‌ణ్‌ను విడుద‌ల చేసేవ‌ర‌కు భార‌త్‌లో ఉన్న ప్రతి పాక్ జాతీయుడిని చిత‌క్కొట్టి దేశం నుంచి తరిమికొట్టాలని వ్యాఖ్యానించింది. వాళ్లు ఎవరైనా సరే... కొట్టి కొట్టి తరమాలని చెప్పింది. పాక్ దిగొచ్చేవ‌ర‌కు ఇది కొనసాగాలని డిమాండ్ చేసింది. కుల్‌భూషణ్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, త‌మ‌ పోరాటం కొనసాగిస్తామని తెలిపింది. పాక్ నుంచి వ‌చ్చి ఉంటున్న‌వారు వ్యాపారవేత్తలైనా, కళాకారులైనా అంద‌రినీ వెళ్ల‌గొట్టాల్సిందేన‌ని వ్యాఖ్యానించింది.

More Telugu News