: జగన్ ఎప్పుడూ ప్రైవేటే.. చంద్రబాబు ఎప్పుడూ పబ్లిక్కే!: మంత్రి సోమిరెడ్డి

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటిపై దుష్ప్రచారం జరుగుతోందని, జగన్ మాదిరిగా చంద్రబాబుకు బంగళాలు లేవని అన్నారు. మీడియాకు చంద్రబాబు ఇంటిని చూపిస్తామని, మరి, జగన్ కూడా తన బంగళాలను మీడియాకు చూపించేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. జగన్ ఎప్పుడూ ప్రైవేటేనని, చంద్రబాబు ఎప్పుడూ పబ్లిక్కేనని మంత్రి చమత్కరించారు.

More Telugu News