: మమతా బెనర్జీ తలను నరకాలన్న వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం!

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను నరికి తెచ్చిన వారికి రూ. 11 లక్షల నజరానా ఇస్తానంటూ బీజేపీ యువమోర్చా నేత యోగేష్ వార్ష్నీ చేసిన వ్యాఖ్యలు ఈరోజు పార్లమెంటును కుదిపేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. మమతపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీఎంసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేసిన నేతతో తమ పార్టీ (బీజేపీ)కి సంబంధం లేదని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. 

More Telugu News