: విమానం టాయిలెట్ లో ఆరు కిలోల బంగారం!

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే విమానం టాయిలెట్ లో దాచి ఉంచిన ఆరు కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విమానం టాయిలెట్ లో బంగారం దాచి ఉంచారనే సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఈ బంగారాన్ని టాయిలెట్ లో ఎవరు దాచి ఉంచారు? ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News