: స్కై వేలపై పూర్తి వివరాలు గడ్కరీకి అందజేశాం: కేటీఆర్

హైదరాబాదులో స్కైవేల నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అందజేశామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. న్యూఢిల్లీలో గడ్కరీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో నితిన్ గడ్కరీ హైదరాబాదు వచ్చిన సందర్భంగా స్కైవేల నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలతో తనను కలవాలని సూచించారని అన్నారు. ఆయన కోరినట్టే హైదరాబాదులో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు, ప్రజలకు మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు స్కైవేలు అవసరమని ఆయన చెప్పారు. అంతే కాకుండా హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు చోట్ల రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మరిన్ని అంశాలపై ఆయనతో చర్చించామని ఆయన తెలిపారు. 

More Telugu News