: మూడు రోజుల ఆఫర్.. రూ.999కే విమాన టిక్కెట్

ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికుల కోసం మరోసారి అద్భుత ఆఫర్లను ప్రకటించింది. మూడు రోజుల ‘సమ్మర్ వెకేషన్ ఆఫర్’ పేరిట అన్ని నెట్ వర్క్ పరిధిలో అన్ని ధరలను కలుపుకుని కేవలం రూ.999కే టిక్కెట్ అందించనుంది. 6E నెట్ వర్క్- దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తక్కువ ధరల్లో ఇండిగో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. నిన్నటి నుంచే ప్రారంభమైన ఈ ఆఫర్ రేపటి వరకు కొనసాగుతుందని చెప్పింది.

ఈ టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది మే 1నుంచి జూన్ 30కి మధ్యలో ప్రయాణాలు చేసుకోవ‌చ్చ‌ని, ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. ముందుగా ఎవ‌రు బుక్ చేసుకుంటారో వారికే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని చెప్పింది. ఒక్కసారి టిక్కెట్ కు చెల్లించిన ఛార్జీల‌కు మళ్లీ రీఫండ్ చేయబోమని తెలిపింది.

More Telugu News