: బంగ్లాదేశ్ ప్రధానితో తన ఆవేదనను పంచుకున్న అద్వానీ!

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో ఇండియా ఫౌండేషన్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హసీనాతో పాటు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ, పాకిస్థాన్ లో ఉన్న సింధ్ రాష్ట్రం భారత్ లో భాగం కాకపోవడం బాధాకరమని అన్నారు. తాను సింధ్ లో జన్మించానని... తన జన్మస్థలం భారత్ లో లేకపోవడం తనకు తీరని లోటు అని చెప్పారు. నాలాంటి ఎంతో మంది ఇదే విషయంలో బాధ పడుతున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని భారత్ కు రావడంతో తన ఆవేదనను ఆమెతో పంచుకున్నానని చెప్పారు. తన చిన్న వయసులో సింధ్ ప్రాంతంలో ఆరెస్సెస్ లో చాలా చురుకుగా ఉండేవాడినని అన్నారు. 

More Telugu News