: ఈ మూడేళ్లలో ఎన్డీఏ బాగా విస్తరించింది: అరుణ్ జైట్లీ

తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఈ మూడేళ్లలో ఎన్డీఏ బాగా విస్తరించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు అపూర్వ మద్దతు లభిస్తోందని, పేదల పక్షాన ఎన్డీయే పని చేస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ సమూహం పెద్దదైందని, 33 పార్టీలు ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో భాగస్వామ్య పక్ష నేతలంతా మాట్లాడారని, దేశ ఆర్థిక వ్యవస్థను ఎన్డీయే బలపరిచిందని, అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుందని, ఎన్డీయేను సుస్థిర పరచాలనే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో శివసేన పాల్గొనడం మంచి పరిణామమని జైట్లీ అన్నారు.

More Telugu News