: నేను తినను..ఎవరినీ తిన నివ్వను: ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్

‘నేను తినను..ఎవరినీ తిన నివ్వను..గడ్డి వాము దగ్గర కుక్కలా కాపలా కాస్తా’ అని ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ అన్నారు. మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఎక్సైజ్ శాఖను కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూడటం లేదన్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో మజ్జిగ చలి వేంద్రాలు ఏర్పాటు చేస్తామని జవహర్ చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో జవహర్ కు ఎక్సైజ్ శాఖ దక్కింది. అంతకుముందు, ఈ శాఖను కొల్లు రవీంద్ర నిర్వహించారు.

More Telugu News