: చెన్నై సూప‌ర్ కింగ్స్‌ హెల్మెట్ పెట్టుకొని ధోనీ భార్య సెల్ఫీ.. అదుర్స్ అంటున్న అభిమానులు!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆడ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. అయితే, సీఎస్‌కే జట్టు గత ఎనిమిది ఐపీఎల్‌ సీజన్లలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలో ఆ జ‌ట్టు దూసుకుపోతోంటే అభిమానులు ఎంతో ఖుషీ అయ్యే వారు. ప‌సుపు ప‌చ్చ క‌ల‌ర్ జెర్సీల‌తో మైదానంలోకి ప్ర‌వేశించి వారు క‌న‌బ‌ర్చిన‌ ఆట‌తీరును అభిమానులు ఇంకా మ‌ర్చిపోలేదు. అయితే, అప్ప‌టి చెన్నై సూప‌ర్ కింగ్స్ జెర్సీ, హెల్మెట్ పెట్టుకొని ధోనీ భార్య సాక్షి ఓ సెల్ఫీ దిగి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి ‘అప్పటి రోజులు’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ పోస్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్యాన్స్ ను అల‌రిస్తోంది. ఈ సెల్ఫీ అదుర్స్ అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 2015లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ యజమానులు బెట్టింగ్‌కి పాల్పడటంతో ఆ జట్టు రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కుంటున్న విష‌యం విదిత‌మే.


#throwback !!

A post shared by Sakshi (@sakshisingh_r) on


More Telugu News