: నా పిల్లలు పేదలుగా మరణించాలని నేను కోరుకోవడం లేదు: లాలూ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బీహార్ లో తాజాగా చోటు చేసుకున్న 'మట్టి కుంభకోణం'పై దుమారం రేగుతున్న సంగతి విదితమే. దీనిపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, పొట్టపోసుకోవడం కోసం వ్యాపారం చేయడం తప్పు కాదని అన్నారు. తన కుమారులు పేదరికంతో మరణించాలని తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమారులు వ్యాపారం చేసుకోవడం తప్పుకాదని ఆయన స్పష్టం చేశారు.

కాగా, పాట్నా శివార్లలో తేజస్వియాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, రబ్రీదేవి పేరిట 2 ఎకరాల స్థలం ఉంది. ఇది సుమారు 60 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా, ఈ ప్రదేశంలో 500 కోట్ల రూపాయలతో ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే భారీ షాపింగ్ మాల్ కట్టేందుకు నడుంబిగించారు. ఈ క్రమంలో అక్కడి మట్టిని తవ్వి నిబంధనలకు విరుద్ధంగా జూలో వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ 2 ఎకరాల స్థలం అక్రమ మార్గాల్లో సంపాదించారంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. 

More Telugu News