: మ్యాక్స్ వెల్, మిల్లర్ దూకుడు... పంజాబ్ విజయం!

తొలుత ఫీల్డింగ్ చేసిన జట్టు విజయం సాధిస్తుందన్న సెంటిమెంట్ ను నిజం చేస్తూ ఇండోర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 10లో 4వ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు పూణే సూపర్ జెయింట్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన అజింక్యా రహానే (19) ఫర్వాలేదనిపించగా, మయాంఖ్ అగర్వాల్ (0) విఫలమయ్యాడు. అనంతరం స్టీవ్ స్మిత్ (26) ఆకట్టుకున్నాడు.

బెన్ స్టోక్స్ (50) అర్ధ సెంచరీతో అలరించగా, ధోనీ (5) విఫలమయ్యాడు. మనోజ్ తివారీ (40), క్రిస్టియన్ (17) మెరుపులు మెరిపించారు. దీంతో 6 వికెట్లు కోల్పోయిన పూణే 163 పరుగుుల చేసింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ విజయం సాధించింది. హాషీమ్ ఆమ్లా (28), మానన్ వోహ్రా (14) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించగా, సాహా (14), అక్షర్ పటేల్ (24) ఆకట్టుకున్నారు. మ్యాక్స్ వెల్ (44), మిల్లర్ (30) మెరుపులు మెరిపించడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించి, విజయం సాధించింది. 

More Telugu News