: కార్డు పెట్టకుండానే నోట్లు కురిపిస్తున్న ఏటీఎం

ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన పది ఏటీఎంలు కార్డు పెట్టకుండానే నోట్ల వర్షం కురిపిస్తున్నాయి. దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ఎస్బీఐ ఆదేశించింది. ల్యాప్ టాప్, డెస్క్ టాప్, స్మార్ట్ ఫోన్లపై మాల్ వేర్ ఎటాక్ జరిగే రీతిలో ఏటీఎంపై మాల్ వేర్ ఎటాక్ జరిగి ఉంటుందని ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెలాఖరుకు ఆడిట్‌ ను పూర్తి చేసిన నివేదిక ఇస్తామని వారు తెలిపారు. యూఎస్బీ పోర్టు ద్వారా పైల్స్, వైరస్‌ ను బదిలీ చేయడం వల్ల ఏటీఎంలు ఇలా అసాధారణంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

More Telugu News