: అవార్డుల కోసం ఎవరికీ డబ్బివ్వలేదు: జాతీయ ఉత్తమ నటుడు అక్షయ్ కుమార్

తాను అవార్డుల కోసం ఎవరికీ డబ్బులివ్వలేదని, ఎవరినీ మోసం చేయలేదని జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్న అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించాడు. ఇండియాకు సంబంధించినంత వరకూ నేషనల్ ఫిల్మ్ అవార్డు చాలా ప్రతిష్ఠాకరమైనదని, దీన్ని అందుకోవడం తనకెంతో ప్రత్యేకమని అన్నారు. గతంలో అవార్డు ప్రదర్శన కార్యక్రమాల్లో డ్యాన్స్ లు చేస్తే, సగం డబ్బిచ్చి, మిగతా సగానికి అవార్డులు ఇస్తామని చెబుతుండేవారని, తాను మాత్రం ఎన్నడూ అందుకు అంగీకరించలేదని అన్నాడు. ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేశారన్న వార్త తొలుత విన్నప్పుడు ఏప్రిల్ ఫూల్ జోక్ గా భావించానని చెప్పాడు. అవార్డు తనకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఈ అవార్డు తనకు రావాలని ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఇంత కాలానికి నెరవేరిందని అన్నాడు. అయినా అభిమానుల ప్రేమ ముందు అవార్డులు చిన్నవని చెప్పాడు.

More Telugu News