: దక్షిణ భారతీయులు కూడా నల్లగా ఉంటారు!: బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారతీయుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆఫ్రికా విద్యార్థులపై జరిగిన దాడిపై ఆయన 'ద స్ట్రీమ్' అనే ఆఫ్రికన్ చానెల్తో మాట్లాడుతూ భారతదేశం జాతి వివక్ష చూపే దేశం కాదంటూనే జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్లోనూ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలు నల్లగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారత్ వారిని అంగీకరిస్తుందిగా? అని అన్నారు. అయితే, అనంతరం తాను నోరుజారినట్లు తెలుసుకుని ట్విట్టర్లో ఇదే అంశంపై ట్వీటు చేశారు. తాము కృష్ణుణ్ణి పూజిస్తామని, అంటే నలుపును గౌరవిస్తామనే తాను చెప్పానని అన్నారు. నిజానికి జాతి వివక్షను భారతే మొదట వ్యతిరేకిస్తుందని, భారత్ బ్రిటిష్ జాతి వివక్షకు బాధిత దేశమేనని అన్నారు.