: ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మరీ బంగ్లాదేశ్ ప్రధానికి స్వాగతం పలికిన మోదీ

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్ పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె చేరుకున్నారు. ఆమెకు స్వ‌యంగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్వాగ‌తం ప‌లికారు. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టేసి మ‌రీ మోదీ ఆ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్ వెళ్లే స‌మ‌యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేస్తారు. సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కాన్వాయ్ ఉందనగానే పోలీసులు ఇతర వాహనాలన్నింటినీ ఆపేసి కాన్వాయ్ వెళ్లిన తర్వాత మాత్రమే అనుమతిస్తారు. కానీ అలా నియంత్రణలు ఏమీ లేని మార్గంలో మోదీ ప్ర‌యాణించారు.
 
సుమారు ఏడు సంవత్సరాల అనంత‌రం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారతదేశంలో పర్యటన‌కు వ‌చ్చారు. షేక్ హసీనా నాలుగు రోజుల భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రేపు ప్రధాని మోదీతో చర్చల్లో పాల్గొంటారు. సైనిక సాయం కోసం బంగ్లాదేశ్‌కు భారత్ సుమారు 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

More Telugu News