: ఏపీలో రేపటి నుంచి ‘ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు’

రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏపీలో ‘ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు’ ప్రారంభించనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గతంలో ఉన్న అర్బన్ సెంటర్ల స్థానే ఈ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిని సీఎం చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 222 ‘ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు’ ప్రారంభమవుతాయని.. ఈ కేంద్రాల్లో ఉచిత వైద్య సేవలతో పాటు, మందులు కూడా అందజేస్తారని తెలిపారు. పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యున్నత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా, రేపటి నుంచి ‘ఆరోగ్య రక్ష’ కేంద్రాలూ ప్రారంభం కానున్నాయని కామినేని తెలిపారు.

More Telugu News