: లోక్ సభలో శివసేన ఎంపీల ప్రవర్తన దురదృష్టకరం: చంద్రబాబు

లోక్ సభలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. శివసేన ఎంపీలు ప్రవర్తించిన తీరును ఖండించారు. శివసేన ఎంపీలు ఆ విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి తీరని మచ్చగా మిగిలిపోతాయని, పార్లమెంటు సంప్రదాయాలను గౌరవించేలా సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ఆయన కోరారు. ఇటువంటి సంఘటనలు మరోమారు జరగకుండా ఆయా పార్టీల నాయకత్వాలు కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News