: తిరుమల వెంకన్న వద్ద ఎన్ని కోట్ల పాత నోట్లు నిలిచిపోయాయో తెలుసా?

పెద్ద నోట్ల రద్దు తిరుమల వెంకన్నకు కూడా కష్టాలను తెచ్చి పెట్టింది. నోట్ల రద్దుతో భారీ ఎత్తున టీటీడీ ఆదాయానికి గండి పడింది. రద్దైన నోట్లను ఇప్పటికీ భక్తులు స్వామివారి హుండీలో వేస్తుండటం... అధికారులకు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. దాదాపు రూ. 20 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. పాత నోట్లను మార్చండి బాబూ అంటూ ఆర్బీఐని టీటీడీ కోరినా... రిజర్వ్ బ్యాంక్ అందుకు అంగీకరించలేదు. దీంతో, ఈ డబ్బునంతా ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

More Telugu News