: ఇంత చెత్త డ్యాన్స్ ను ఎక్కడా చూడలేదు: అమీ జాక్సన్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో సెటైర్లు

ఐపీఎల్ పదవ సీజన్ ప్రారంభం సందర్భంగా, నిన్న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హీరోయిన్ అమీ జాక్సన్ చేసిన డ్యాన్స్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఆమె నృత్యం అత్యంత విషాదకరంగా సాగిందని, అసలు డ్యాన్స్ రానివాళ్లు కూడా ఆమెకన్నా బాగా గంతులు వేయవచ్చని నెటిజన్లు మండిపడ్డారు. అమీ జాక్సన్ కన్నా సన్నీ డియాల్ మంచి డ్యాన్సర్ అని నిరూపితమైందని, ఆమె ప్రదర్శన చూసి 28 మంది డ్యాన్స్ టీచర్లు, తమ అకాడమీలను శాశ్వతంగా మూసేసుకుని కాశీ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 'సో పాథటిక్', 'డామ్ హిలేరియస్', 'వజ్ నాట్ గుడ్' అంటూ, అమీ జాక్సన్ ప్రదర్శన ముగియగానే ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్టులు వెల్లువెత్తాయి. ఇకపై ఆమె డ్యాన్స్ చేయకూడదని, శునకాలు కూడా ఆమెకన్నా బాగా గంతులేస్తాయన్న సెటైర్లూ వచ్చాయి.

కాగా నేడు ముంబైలో జరగనున్న పోటీకి ముందు రితీశ్ దేశ్ ముఖ్, ఆపై శుక్రవారం నాడు రాజ్ కోట్ లో టైగర్ షరాఫ్ ల ప్రదర్శనలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆపై 13న మొహాలీ స్టేడియంలో శ్రద్ధా కపూర్, 15న ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పరిణీతి చోప్రాల నృత్య ప్రదర్శనలు ఉన్నాయి. ఐపీఎల్ 10వ సీజన్ ఉత్సవాల్లో భాగంగా, ప్రతి స్టేడియంలో తొలి మ్యాచ్ కి ముందు సెలబ్రిటీల ప్రదర్శనలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News