: నేడు రాష్ట్రపతి వద్దకు జగన్... నాలుగు రోజులు ఢిల్లీలోనే మకాం!

ప్రజాస్వామ్యాన్ని సంరక్షించండి (సేవ్ డెమోక్రసీ) పేరిట వైకాపా అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ఢిల్లీ యాత్ర నేటి నుంచి మొదలు కానుంది. వైకాపా టికెట్ పై గెలిచి, ఆపై రాజీనామాలు చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరి, మంత్రి పదవులు పొందడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్, ఇదే విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని, పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చూడాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగుతోంది. ఇక ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరే జగన్, మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఆపై పార్లమెంటులోని అన్ని పక్షాల నేతలనూ జగన్ బృందం కలవనుంది. దాదాపు నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న జగన్, పలువురు కేంద్ర మంత్రులు సహా, ముఖ్య నేతలను కలుస్తారు.

More Telugu News