: కర్నూలు జిల్లా కలెక్టర్, వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం!

కర్నూలులో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సభ రసాభాసగా మారింది. కలెక్టర్ కు, వైఎస్సార్సీపీ నేతలకు మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. తెలంగాణలో నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించారు. దీంతో పక్క రాష్ట్రాల పథకాల ప్రస్తావన తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు. దీంతో, మాజీ మంత్రి మారెప్ప కలుగజేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ క్రమంలో కలెక్టర్ పై మారెప్ప మండిపడటంతో, అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కలుగజేసుకుని వారికి సర్దిచెప్పారు.

More Telugu News