: 'అమ్మా క్షమించు' అంటూ తల్లికి మెసేజ్ పెట్టి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న టెక్కీ మధుకర్ రెడ్డి

గత ఏడు సంవత్సరాలుగా యూఎస్ లోని సియాటెల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న తెలంగాణకు చెందిన టెక్ నిపుణుడు గూడూరు మధుకర్ రెడ్డి (37) ఆత్మహత్యకు పాల్పడే ముందు తన తల్లికి 'డియర్ మదర్, కైండ్లీ ఫర్ గివ్ మీ' (అమ్మా దయచేసి నన్ను క్షమించు) అని మెసేజ్ పెట్టాడు. ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలోని భువనగిరిలో ఉంటుండగా, కొడుకు ఆత్మహత్య గురించి నిన్న సమాచారం అందింది. మధుకర్ నాలుగు నెలల క్రితమే ఇండియాకు వచ్చి వెళ్లాడని, ఆర్థికంగా అతని కుటుంబం మంచి స్థితిలోనే ఉందని, తిరిగి ఇండియాకు వచ్చి, ఇక్కడే పని చేసుకుంటానని ఎప్పుడూ చెబుతుండేవాడని, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని మధుకర్ బంధువు దుర్గా రెడ్డి తెలిపారు. మధుకర్ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని అన్నారు.

More Telugu News