: కేబినెట్ ఏ పార్టీదో చెప్పుకోలేని పరిస్థితి ఉంది!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాజకీయం వ్యాపారంగా మారిందని, దీంతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. హోం మంత్రి చినరాజప్ప ఆయన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పార్టీకి మేలు జరగాలనే ఉద్దేశంతోనే బహిరంగంగా తాను మాట్లాడుతున్నానని అన్నారు. ‘నేనేం తప్పు మాట్లాడలేదు. ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమనండి. కేబినెట్ ఏ పార్టీదో చెప్పుకోలేని పరిస్థితి ఉంది’ అంటూ ఆయన మండిపడ్డారు.

More Telugu News