: ‘టెన్నిస్’కు పాతదాన్ని అయిపోయా: సానియా మీర్జా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు

గత పదిహేను ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నానని, ఆటలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, టెన్నిస్ కు తాను పాతదాన్ని అయిపోయానని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది. మియామి ఓపెన్ లో మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా- స్ట్రికోవా జోడీ రన్నరప్ గా నిలిచింది. అనంతరం సానియా మీర్జా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం జరిగిన ఈ మ్యాచ్ లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన వై.జు (చైనా)- గాబ్రియల్ (కెనడా) చేతిలో సానియా జంట ఓటమిపాలైంది. 

More Telugu News