: ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పవర్‌బ్యాంక్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోం: రాచకొండ సీపీ

ఎల్లుండి నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్ స్టేడియంలో మొద‌టి మ్యాచు జ‌ర‌గ‌నుంది. న‌గ‌రంలో మొత్తం 8 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని రాచకొండ కమిషనరేట్‌ సీపీ మహేశ్‌భగవత్‌ తెలిపారు. ఇందు కోసం భారీ భద్రత ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. మొత్తం 1800 మంది పోలీసులు, 88 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పిన ఆయ‌న‌... ఈ మ్యాచ్‌లకు ప్రత్యేక షీ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్టేడియంలోకి పవర్‌బ్యాంక్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోమ‌ని చెప్పారు. స్టేడియం పరిసరాల్లో 9వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించామ‌ని, మధ్యాహ్నం 3.30కు అభిమానుల‌ను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు.

More Telugu News