: చంద్రబాబు హామీ ఇచ్చారు... డోంట్ వర్రీ: అభిమానులతో జ్యోతుల నెహ్రూ

మంత్రి పదవి దక్కుతుందని ఎంతో ఆశ పడ్డ జ్యోతుల నెహ్రూకు... చివరకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో, జగ్గంపేట మండలంలోని ఇర్రిపాకలో ఉన్న నెహ్రూ నివాసం వద్దకు ఆయన అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా వారితో నెహ్రూ మాట్లాడుతూ, ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో తనకు న్యాయం జరగకపోయినా... భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని అన్నారు. తనకు న్యాయం చేస్తాననే హామీని చంద్రబాబు కూడా ఇచ్చారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చానని... తనకు పదవులతో పని లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి పనుల్లో ఏవిధంగా చురుకైన పాత్రను పోషించామో... భవిష్యత్తులో అంతకు రెట్టింపు చురుగ్గా పనిచేయాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. 

More Telugu News