: గవర్నర్ కూడా ఇలా చేయడం దారుణం: సామినేని ఉదయభాను

ఏపీ మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులను కట్టబెట్టడం దారుణమని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవిని చేపట్టినప్పుడు... చంద్రబాబు నానా హంగామా చేశారని తెలిపారు. అప్పట్లో గవర్నర్ ను సైతం చంద్రబాబు దూషించారని అన్నారు. ఇప్పుడేమో పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొని, వారిచేత ప్రమాణస్వీకారం చేయించడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ప్రభుత్వ తీరుపై పోరాటం చేస్తామని చెప్పారు. 

More Telugu News