: పదవి రాలేదన్న అసంతృప్తి.. నేడు పెడన బంద్‌కు పిలుపునిచ్చిన కాగిత వెంకట్రావు అనుచరులు

కేబినెట్ బెర్త్‌లో చోటు లభించలేదన్న అసంతృప్తితో ఉన్న కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనుచరులు నేడు (సోమవారం) బంద్‌కు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో బంద్ నిర్వహించనున్నట్టు తెలిపారు. కొత్త మంత్రుల జాబితాలో కాగిత పేరు లేకపోవడంతో ఈ నాలుగు మండలాలకు చెందిన నేతలు ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో సమావేశమయ్యారు. ఆయనకు పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా బంద్ పాటించాలని నిర్ణయించారు.

More Telugu News