: తెనాలిలో దారుణం...భార్యపై భర్త యాసిడ్ దాడి

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. తెనాలిలోని భాస్కర్‌ రావు దిబ్బ ప్రాంతంలో నివాసం ఉండే బ్రహ్మం కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి. దీంతో భార్యపై కక్షగట్టిన బ్రహ్మం తన భార్య షేక్ రిజ్వానాపై యాసిడ్‌ తో దాడిచేశాడు. దీంతో ఆమె ముఖం, ఒంటిపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, బాధితురాలిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి, నిందితుడు బ్రహ్మంపై కేసు నమోదు చేశారు.  

More Telugu News