: ఆదిలాబాద్ లో సూర్య ప్రతాపం!

ఆదిలాబాద్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అగ్నిగుండంగా మారిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్. దీంతో, ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితులు లేవు. నిజామాబాద్, మహబూబ్ నగర్, రామగుండం వంటి ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండలు బాగానే వుంటాయి. 

More Telugu News