: రద్దయిన పెద్దనోట్లు రూ.2 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే!

గత ఏడాది నవంబర్ లో పెద్దనోట్లు రూ.500, రూ.1000 ను ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. అయితే, గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో రూ.2 లక్షలకు పైబడి పెద్దనోట్లను జమ చేసిన  వారు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఒక పేజీ ఐటీ రిటర్న్ ఫామ్ కింది భాగంలో దీని కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ కేటాయించారు. 

More Telugu News