: ముంబైలో ఉన్న జిన్నా ఇల్లు మా దేశ ఆస్తి: పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి

ముంబైలో ఉన్న తమ దేశ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఇంటిని తమకు అప్పగించాలని పాకిస్థాన్ ప్రభుత్వం కోరింది.  ఈ ఇంటిపై తమ ప్రభుత్వానికి ఉన్న యాజమాన్య హక్కును భారత సర్కారు గౌరవించాలని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఆ ఇల్లు తమ దేశ ఆస్తి అని, ఈ ఇంటిని భారత ప్రభుత్వం పరిరక్షిస్తుందన్న నమ్మకాన్ని ఆ ప్రకటనలో వ్యక్తం చేశారు. ఈ ఇంటిని తమకు అప్పగిస్తామని భారత ప్రభుత్వం పలు సందర్భాల్లో తమకు హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాగా, దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా ప్యాలెస్ ను కూల్చి వేసి, సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్ మంగల్ ప్రభాత్ లోధా ఇటీవల డిమాండ్ చేశారు.

More Telugu News