: ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి: హైకోర్టు సంచలన తీర్పు

దాదాపు ఎనిదిదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా హత్యకేసులో హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబు నిర్దోషని ప్రకటించింది. ఈ కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబుకు జీవిత ఖైదును విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రెండు సెక్షన్ల కింద మహిళా సెషన్స్ కోర్టు శిక్ష ఖరారు చేసింది.

దీనిపై సత్యం బాబు హైకోర్టులో అపీలు చేయగా, వాదనలు విన్న కోర్టు, సంచలన తీర్పును ఇస్తూ, ప్రాసిక్యూషన్ వాదనలు అతడే దోషని నిరూపించడం లేదని అభిప్రాయపడింది. ఆధారాలు లేకుండా ఎనిమిదేళ్ల పాటు సత్యంబాబును జైల్లో పెట్టారని పోలీసులను మందలించింది. సత్యంబాబుకు రూ. లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అప్పట్లో కేసును విచారించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

More Telugu News