: ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన సండ్ర

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ ఉదయం కోర్టుకు హాజరయ్యారు. ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు నేడు విచారణకు రాగా, సండ్ర కోర్టుకు హాజరయ్యారు. కాగా, కేసు విచారణ మాత్రం ఏమీ జరగలేదని సమాచారం. న్యాయవాదులు వాయిదా కోరగా, తదుపరి విచారణను మే 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి సహా, పలువురు తెలుగుదేశం నేతలు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News