: తండ్రి చితిమంట ఆరకముందే ఆడబిడ్డతో చంద్రబాబు శవరాజకీయాలు: రోజా నిప్పులు

భూమా నాగిరెడ్డి చితిమంటలు ఆరకముందే, ఆయన కుమార్తెను ఊరి పొలిమేరలు దాటించి తెచ్చి చంద్రబాబు శవరాజకీయాలకు పాల్పడ్డారని వైకాపా ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీని గెలిపించకుంటే, మంత్రి పదవి ఇచ్చేది లేదని భూమా నాగిరెడ్డికి చంద్రబాబు తెగేసి చెప్పి, ఆయనలో మానసిక ఆందోళన కలిగించారని విమర్శించిన రోజా, ఆయన మరణానికి చంద్రబాబే కారణమని అన్నారు. పదకొండు రోజుల మైల కూడా తీరకమునుపే, ఆడబిడ్డను అసెంబ్లీకి తీసుకు వచ్చారని ఆరోపించారు. తండ్రి అంత్యక్రియలు 4 గంటలకు జరిగితే, ఆ రాత్రికే ఆమెను ఆళ్లగడ్డ నుంచి విజయవాడకు బలవంతంగా తీసుకు వచ్చారని, అసెంబ్లీలో దిగజారుడు రాజకీయాలు చేశారని, వీటన్నింటినీ ప్రజలు చూస్తున్నారని అన్నారు.

More Telugu News