: మొగల్తూరు మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం: కలెక్టర్ ప్రకటన

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆనంద్ ఆక్వా ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి ఒక్కొ కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ భాస్కర్ తెలిపారు. ఈ పరిహారంలో 15 లక్షల రూపాయలను ఆనంద్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తరపున, మిగిలిన 10 లక్షల రూపాయలను ప్రభుత్వం తరపున, ఒక్కో కుటుంబానికి అందజేయనున్నామని ఆయన ప్రకటించారు. కాగా, ఈ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్, ఇతర పార్టీలకు చెందిన నేతలు మొగల్తూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని, నిందితులకు కఠిన శిక్షలు పడతాయని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News