: శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థి పేరు ఖరారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రేపటికి వాయిదా పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్సీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్గా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. ఇంతవరకు డిప్యూటీ ఛైర్మన్గా ఉన్న సింగిరెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి స్థానంలో టీడీపీ కొత్త అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యంను ఎంపిక చేశారు.