: నారా లోకేష్ కు సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్న టీడీపీ నేత

తెలుగుదేశం పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. కృష్ణా జిల్లాలోని జి.కొండూరు మండలం గడ్డమడుగుకు చెందిన అప్పసాని ఈశ్వర్ టీఎన్ఎస్ఎఫ్ (తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. టీడీపీ ప్రభుత్వ వైఖరి పట్ల విసిగిపోయిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందంటూ ఆవేదన చెందిన అతను బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతేకాదు నారా లోకేష్ కు సూసైడ్ నోట్ కూడా రాశారు.

పార్టీ అభ్యున్నతి కోసం జీవితాంతం తాను పని చేశానని... తమకు పదవులు రాకపోయినా బాధపడలేదని... కానీ, ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పని చేసి, ఇప్పుడు పార్టీలో చేరిన వారి నుంచి పార్టీని కాపాడాలని కోరుతూ సూసైడ్ నోట్ రాశారు. సేవ్ టీడీపీ... ఇక సెలవు అంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ లేఖను ఫేస్ బుక్ లో కూడా అప్ లోడ్ చేశారు. ఈశ్వర్ ఆత్మహత్య ఇప్పుడు పార్టీలో కలకలం రేపింది. హాట్ టాపిక్ గా మారింది.

More Telugu News